దసరా సినిమాతో టాలీవుడ్లో గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ప్రస్తుతం ఆయన నేచురల్ స్టార్ నాని హీరోగా పారడైజ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో ఒక ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. పారడైజ్ క్లైమాక్స్లో ఒక ఊహించని ట్విస్ట్ ఉండబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ చివరి ఘట్టంలో మెగాస్టార్ చిరంజీవి ఒక పవర్ఫుల్ కామియో రోల్లో కనిపిస్తారని టాక్ వస్తోంది. ఆ కామియో ద్వారానే చిరంజీవి తదుపరి సినిమాకు సంబంధించిన లీడ్ ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఫలితంగా నాని పారడైజ్ క్లైమాక్స్ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక నెక్ట్స్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ఓదెల సినిమాటిక్ యూనివర్స్ అనే సరికొత్త కాన్సెప్ట్ టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. ఈ సినిమాటిక్ యూనివర్స్ కేవలం రెండు సినిమాలతోనే ఆగడం లేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కథను మరింత లోతుగా వివరించడానికి ఒక ప్రీక్వెల్ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఇది నాని, చిరంజీవి ఇంకా మరికొంత మంది స్టార్స్ ఉండే మల్టీపార్ట్ సాగాగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్లో ఈ గాసిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి. శ్రీకాంత్ ఓదెల సినిమాటిక్ యూనివర్స్ టాలీవుడ్ రేంజ్ను మార్చేస్తుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తలపై స్పష్టత రావాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్లకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్, ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు టాక్.